తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో  సీబీఐ సోదాలు

సీబీఐ దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. నకిలీ విదేశీ వైద్య సర్టిఫికెట్ల కేసులో ఈ సోదాలు చేపట్టింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షను కేంద్రం నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో 73 మంది ఫెయిలయ్యారు. స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు పొందుపరిచినట్లు కేంద్రానికి సమాచారం వచ్చింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఫిర్యాదు నేపథ్యంలో ఈ నెల 21న సీబీఐ కేసు నమోదు చేసింది.

తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులను, ఏపీకి చెందిన ఇద్దరిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది. దర్యాప్తులో భాగంగా మఈ నెల 23న విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు జరిపారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థుల వివరాలు సేకరించింది. 2011 నుంచి నమోదైన వివరాలను సీబీఐ సేకరించించింది. రిజిస్టర్లు, కంప్యూటర్లలోని డేటాను స్వాధీనం చేసుకుంది.