The Buried Truth: సంచలన హత్యకేసుపై వెబ్ సిరీస్.. విడుదల ఆపాలంటూ సీబిఐ నోటీసులు

The Buried Truth: సంచలన హత్యకేసుపై వెబ్ సిరీస్.. విడుదల ఆపాలంటూ సీబిఐ నోటీసులు

ది బరీడ్ ట్రూత్(The Buried Truth) వెబ్ సిరీస్ విడుదలను ఆపాలంటూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీపై వస్తున్న సిరీస్‌ కావడంతో ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేసింది సీబీఐ. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ లో ఫిబ్రవరి 23 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సిరీస్ ను నిలిపివేయాలంటూ కోర్టుకెక్కింది సీబీఐ.

షీనా బోరా హత్య కేసు విచారణ ముగిసే వరకు ఈ సిరీస్‌పై స్టే విధించేలని, వెంటనే సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేయాలని దరఖాస్తులో సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ పిటీషన్ పై వాదన జరిపిన సదరు కోర్టు.. నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాతో పాటు ఇతరులకు దరఖాస్తుపై స్పందించాలని నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల (ఫిబ్రవరి)20కి వాయిదా వేసింది. 
 
ఇక ది బరీడ్ ట్రూత్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే. ఈ సిరీస్ లో షీనా బోరా హత్య గురించి వివరించారు. చనిపోయిన షీనా ముఖర్జీ ఇంద్రాణి కుమార్తె. ఆమె 2012లో హఠాత్తుగా అదృశ్యం అయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఇంద్రాణి, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్ కలిసి షీనాను కారులో గొంతుకోసి హత్య చేశారని తేల్చారు. అయితే ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. అందుకే ఈ కేసు విచారణ ముగిసే వరకు ఈ సిరీస్ టెలికాస్ట్ అవకుండా ఆపాలని కోరింది.

Also Read : బాలకృష్ణతో పీరియాడికల్ మూవీ.. భారీగా ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్టర్