జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై సీబీఐ కేసు

జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై సీబీఐ కేసు

ఛైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, డైరెక్టర్ జీవీ సంజయ్ లపై కేసు నమోదు

జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. జీవీకే గ్రూప్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కాంట్రాక్ట్ ఒప్పందంలో జీవీకే గ్రూప్ అవినీతికి పాల్పడినట్టు సీబీఐ ఆరోపించింది. 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి కోట్లరూపాయలను దారి మళ్లించినట్లు ఆరోప‌ణ చేసింది. దీనివల్ల 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు విచారణ లో వెల్లడించింది.

సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం.. మియాల్ సంస్థ‌తో జీవీకే  ఒప్పందం కుదుర్చుకుంది.  2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి..కోట్ల రూపాయ‌లు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ 800 కోట్లను దుర్వినియోగం చేశారని సీబీఐ తెలిపింది.

ఈ కేసులో జీవీకే గ్రూప్ ఛైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి , అతని కుమారుడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జీవీ సంజయ్ రెడ్డిలతోపాటు మియాల్, జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరో 9 ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Dr G V K Reddy, sanjay reddy