- ఆర్ట్స్కాలేజీ వద్ద బెలూన్లు ఎగుర వేసి విద్యార్థుల డ్యాన్సులు
ఓయూ,వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ కల్పన దిశగా ముందుకు సాగుతుందని రాష్ర్ట గ్రంథాలయాల చైర్మన్రియాజ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయినందున ఆదివారం ఓయూలో భారీగా సంబరాలు నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ఆధ్వర్యంలో ఆర్ట్స్కాలేజీ వద్ద ర్యాలీ నిర్వహించిన అనంతరం గాలిలోకి 100 బెలూన్లు ఎగురవేశారు. అనంతరం పటాకులు పేల్చి, ప్రజా పాలన సక్సెస్ అయిన సందర్భంగా విద్యార్థులు డ్యాన్సులు చేశారు.
కాంగ్రెస్ప్రభుత్వాన్ని పొగుడుతూ నినాదాలు చేశారు. వేయి మంది విద్యార్థులకు పోటీపరీక్షల మెటీరియల్ను పంపిణీ చేశారు. రియాజ్ మాట్లాడుతూ రాష్ర్ట గ్రంథాలయాల చైర్మన్రియాజ్ మాట్లాడుతూ..100 రోజుల పాలనలోనే 34 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డిది అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని యువతను కోరారు. చనగాని దయాకర్తో పాటు టీపీసీసీ ప్రతినిధి బాలలక్ష్మి, ఎన్ఎస్యూ నేతలు మేడ శ్రీను, సుమన్ గౌడ్ , నవీన్, వినోద్, మహేశ్పాల్గొన్నారు.