కృష్ణంరాజు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

కృష్ణంరాజు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

రెబల్ స్టార్ కృష్ణంరాజు పార్థివదేహానికి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు మురళీ మోహన్, చింతల రాంచంద్రా రెడ్డి, విద్యాసాగర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మోహన్ బాబు, మంచు విష్ణు, డైరెక్టర్ అశ్వనీ దత్, నిర్మాత దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంతాపం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో 2, 3 సార్లు హాస్పిటల్ కి వెళ్ళొచ్చారని తెలిసిందన్నారు. కానీ ఇప్పుడిలా చూస్తామనుకోలేదన్నారు. తన చిన్నతనంలో ఆయన సినిమాలు చేస్తూ పెరిగానన్న చిరంజీవి... -ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తమకు హెల్ప్ చేసాడన్నారు. మంచితనానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఆయనకున్న పరిధిలో మంచి చేయడానికి రాజకీయాలలోకి వెళ్లారని చెప్పారు.  ఆయనకి తన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. కృష్ణరాజు ని కోల్పోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటన్న దిల్ రాజు... చివరివరకు ఆయన చేసిన మంచిని ఎవరు మర్చిపోలేరని చెప్పారు. ఆయన భౌతికంగా లేకున్నా... ఆయన సినిమాలు చిరకాలంగా ఉంటాయన్నారు. ఆయన గుణాలన్ని ప్రభాస్ కి ఇచ్చారని దిల్ రాజు తెలిపారు.