ప్రతిపక్షం మాట్లాడితే అధికారపక్షం సహించలేకపోతోంది

ప్రతిపక్షం మాట్లాడితే అధికారపక్షం సహించలేకపోతోంది

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు ఆరోపించారు. పార్లమెంట్  సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం తంతుగా మారిందన్నారు. ప్రతిపక్షం కొంచెం మాట్లాడితే అధికారపక్షం సహించలేక పోతుందని విమర్శించారు. పార్లమెంట్ లో ఫారెస్ట్ కన్సర్వేటివ్ బిల్లు వ్యతిరేకిస్తామన్నారు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు. ఆదివాసీలకు ఇబ్బంది కలిగేలా ఫారెస్ట్ కన్సర్వేటివ్ బిల్లు ఉందన్నారు.