టాలీవుడ్ నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ఫేక్ వీడియో ఉదంతంపై కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు ఆమె ఫొటోను ఏఐ టెక్నాలజీతో అశ్లీలంగా చేసి సోషల్మీడియాలో రిలీజ్ చేయడంతో అది వైరల్గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటివి భయాందోళనకు గురిచేస్తున్నాయని దీనిపై అంతా కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చింది.
తాజాగా కేంద్రం ఈ అంశంపై స్పందిస్తూ..ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి కంటెంట్ను ప్రోత్సహించరాదని సోషల్మీడియా ప్లాట్ఫాంలకు ఓ సర్క్యూలేషన్ జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా ఉంటుందని అందులో పేర్కొంది.
రష్మికకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. దీనిపై లీగల్ కేసు నమోదు చేయాలని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను కోరారు.
టెక్నాలజీ దుర్వినియోగాన్ని చూస్తుంటే భవిష్యత్తుపై భయం వేస్తోందని సినీ నటుడు నాగచైతన్య ఈ అంశపై స్పందించాడు. ఇంతమంది తనకు అండగా నిలవడంపై రష్మిక మందన్నా కృతజ్ఞతలు తెలిపింది.
Thank you @chay_akkineni ? https://t.co/HXjfMRf6uu
— Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023