- పాజిటివ్ వచ్చే ఛాన్స్ తక్కువే
- కోవాగ్జిన్ తీసుకున్నోళ్లలో పాజిటివ్ రేటు 0.04 శాతం
- కోవిషీల్డ్ వేసుకున్నోళ్లలో పాజిటివ్ రేటు 0.03 శాతం
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ వేసుకున్నాక పాజిటివ్ వస్తున్న కేసులు చాలా తక్కువేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకున్నోళ్లలో పాజటివ్ రేటు కేవలం 0.04 శాతమేనని, కొవిషీల్డ్ తీసుకున్న వారిలో 0.03 శాతంగా ఉందని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న 10 వేల మందిలో కేవలం ఇద్దరి నుంచి నలుగురికి మాత్రమే పాజిటివ్ వస్తోందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకినా దాని తీవ్రత మాత్రం చాలా తక్కువని నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ చెప్పారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉండే హెల్త్ సిబ్బందిలోనే వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా సోకుతున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, సామాన్య జనం విషయంలో మాత్రం చాలా తక్కువేనని అన్నారు.