
- రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు
- ఫామ్హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ
- మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లపైనా ఆరా
- పలువురు బీజేపీ అగ్ర నేతల ఫోన్లూ ట్యాప్ చేసినట్టు అనుమానాలు
- సాఫ్ట్వేర్, డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ
- కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కార్హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ను ఫామ్హౌస్ కేసులో ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో వెల్లడించడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది.
లిక్కర్ కేసు నుంచి తన కూతురు కవితను కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ కేసులో తమ పార్టీ అగ్ర నేతలను ఇరికించేందుకు ప్రయత్నించారన్న విషయాన్ని బీజేపీ హైకమాండ్ జీర్ణించుకోలేకపోతున్నది. తమ పార్టీకి చెందిన మరికొంత మంది అగ్ర నేతల ఫోన్లనూ ట్యాప్ చేసినట్టు అనుమానిస్తున్నది. దీనిపై సమగ్ర సమాచారం సేకరించేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు రంగంలోకి దిగినట్టు తెలిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులకు టచ్లోకి వచ్చి ట్యాపింగ్ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
మంగళ, బుధవారాల్లో ఢిల్లీ నుంచి కొందరు సెంట్రల్ ఇంటెలిజెన్స్ఆఫీసర్లు ఫోన్ చేశారని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించాలని వాళ్లు కోరిన ట్టు ఆయన చెప్పారు. మాజీ డీసీపీ రాధాకిషన్రావుతో పాటు ఈ కేసులో అరెస్టయిన ఇతర పోలీసు అధికారులు విచారణలో వెల్లడించిన వివరాలను అందజేయాలని అడిగినట్టు పేర్కొన్నారు. ఇక నిన్నామొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్వ్యవహారంతో తమకు పెద్దగా సంబంధం లేదని భావించిన బీజేపీ రాష్ట్ర నేతలు... అక్రమ కేసులో తమ పార్టీ నేతలను ఇరికించేందుకు కుట్ర చేశారని తెలియడంతో అలర్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్విప్మెంట్ ఎక్కడిది?
ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే దానికి అనేక రూల్స్ ఉంటాయి. ఉగ్రవాద కార్యకలాపాలు, దేశ భద్రతకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్చేయాల్సి వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ అనుమ తి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి కార్యకలాపాలతో పాటు కొన్ని సీరియస్నేరాల ఇన్వెస్టిగేషన్ సమయంలో ట్యాపింగ్ అవసరమైతే పోలీసు ఉన్నతాధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది.
అయితే ఆ ట్యాపింగ్ కూడా నిర్ణీత సమయం వరకే చేయవచ్చు. కానీ, గత బీఆర్ఎస్ సర్కార్ దీన్ని ఇష్టారాజ్యంగా వాడినట్టు దర్యాప్తులో తేలింది. రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలపైనా ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయో గించింది. ఇందుకోసం అవసరమైన పరికరాలు, సాఫ్ట్వేర్ను విదేశాల నుంచి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపైనా తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్కు కావాల్సిన సాఫ్ట్ వేర్, పరికరాలు ఏయే దేశాల నుంచి కొనుగోలు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
అలర్ట్ అయిన బీజేపీ..
నిన్నమొన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ను బీఆర్ఎస్, కాంగ్రెస్కు సంబంధించిన అంశంగానే చూసిన బీజేపీ.. ఇప్పుడు అలర్ట్అయింది. తమ పార్టీ అగ్ర నేతను అక్రమ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని తెలిసి, దాన్ని సీరియస్గా తీసుకున్నది. ఈ నేపథ్యంలో కేసు విచారణ పకడ్బందీగా జరిగేలా చూడాలని, ఇందులో కేసీఆర్ ప్రమేయాన్ని తేల్చాలని అనుకుంటున్నది.
ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే విచారణపై తమ పట్టు కూడా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సమాచార సేకరణలో నిమగ్నమైన కేంద్ర నేతలు.. ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్గా దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఎన్నికలు టార్గెట్గా ట్యాపింగ్..
బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ను అస్త్రంగా వాడుకున్నట్టు ఈ కేసులో అరెస్టయిన పోలీసులు వెల్లడించారు. అంతకుముందు పలు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ను వినియోగించినట్టు చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలపై నిఘా పెట్టినట్టు తెలిపారు. ఈ క్రమంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రఘు నందన్ రావు, ధర్మపురి అర్వింద్, కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితర నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు పేర్కొ న్నారు. ఇక ఫామ్హౌస్ కథ నడిపించి, ఏకంగా బీజేపీ టాప్ లీడర్ బీఎల్ సంతోష్ను ఇరికించాలని చూశారు. దీంతో ఇతర అగ్ర నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉండొచ్చని బీజేపీ హైకమాండ్ అనుమానిస్తున్నది.
రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు మంచి అవ కాశాలున్నాయని భావించిన ఆ పార్టీ హై కమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్పెట్టిం ది. ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ నేతలు వచ్చి రాష్ట్రంలో ప్రచారం నిర్వ హించారు. కొందరు ఇక్కడే ఉండి పరిస్థి తులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారని బీజేపీ హైకమాండ్ అనుమానిస్తున్నది. దీనిపైనా సమాచారం సేకరించాలని కేంద్ర నిఘా సంస్థలు భావిస్తున్నట్టు తెలిసింది.