కేంద్ర ప్రభుత్వం  చేతికి వొడాఫోన్‌ ఐడియా

 కేంద్ర ప్రభుత్వం  చేతికి వొడాఫోన్‌ ఐడియా

దేశంలో మూడో అతిపెద్ద ఫోన్‌ అపరేటర్‌గా ఉన్న వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్‌ వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు ఇవాళ(మంగళవారం) అధికారికంగా ప్రకటించింది. దీంతో వొడాఫోన్‌- ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. గత కొద్దికాలంగా.. వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లను భారీగా కోల్పోవడం, లాభదాయక పరిస్థితులు కనిపించకపోవడంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపినట్లు కంపెనీ తెలిపింది. లండన్‌కు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ 28.5 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌ 17.8 శాతం వాటాలను కలిగి ఉందని చెప్పింది. లేటెస్టుగా  కంపెనీ తీసుకున్న నిర్ణయంతో.. భారత ప్రభుత్వం 36 శాతం వాటానాను కలిగి ఉండడంతో కీలక పాత్ర పోషించే అవకాశముంది. 

మరిన్ని వార్తల కోసం..

 

పాలమూరులో 14 సీట్లలో బీజేపీని గెలిపిస్తరు