సనాతన ధర్మంలో జీవుడే సత్యం

సనాతన ధర్మంలో జీవుడే సత్యం

రామానుజాచార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అనేక యుగాలవరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ముచ్చింతల్‎లో శ్రీరామనగరం దర్శించుకున్న అమిత్ షా.. ప్రవచన మండపంలో ప్రసంగించారు. ముచ్చింతల్‎లో మూడున్నర గంటల పాటు పర్యటించిన షా.. తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు.

‘రామాయణ, భారత కాలాల నుంచి ఇప్పటివరకు సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది. సనాతన ధర్మం యాత్ర ఆగిపోదు.. ప్రపంచమంతా విస్తరిస్తుంది. సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుంది. సనాతన ధర్మ పరిరక్షణలో ముందుకు సాగుతున్న చిన్నజీయర్ స్వామికి నా అభినందనలు. నేను జన్మతా వైష్ణవుడిని. ఇంతమంది ఆచార్యులు, సాదు సంతవుల ముందు విశిష్టాద్వైతం గురించి మాట్లడలేను. రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్నిసూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడు బోధనలు చేశారు. రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహా తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయి. ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాలల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. రామానుజాచార్యుడు గురువు ఆదేశాలను ధిక్కరించి ఆయన బోధించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికి వినిపించారు. ఆలయ శిఖరంపైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సాధారణ ప్రజలకు వినిపించారు. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ  ప్రతిమ దూరం నుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుంది’ అని షా అన్నారు.

షా ఇక్కడికి వచ్చి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు
అమిత్ షా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శించి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారని చిన్నజీయర్ స్వామి అన్నారు. అమిత్ షా రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం చాల సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ‘108 దివ్య దేశాలను సందర్శించి.. సమతా మూర్తి ప్రాంగణములోని ప్రివ్యూ థియేటర్‎ను అమిత్ షా ప్రారంభించారు. అమిత్ షా ఇక్కడికి వచ్చి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. అమిత్ షా అందరికి ప్రేరణనిచ్చేట్లు ప్రసంగించారు. రాజకీయాల్లో విభిన్న సిద్ధాంతాలున్నప్పటికీ..  భగవంతుని వద్దకు రావడానికి అందరూ కలిసి ముందుకు సాగాలి’ అని జీయర్ స్వామి అన్నారు.