ఏసీపీలు నరసింహారావు, మోహన్కుమార్కు కేంద్ర హోంశాఖ అవార్డులు
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర హోం శాఖ అవార్డులు దక్కాయి. రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఏవీఆర్ నరసింహారావు, ఏసీపీ ఎన్.మోహన్ కుమార్ను ‘మెడల్ ఫర్ ఎక్స్ లెన్సీ ఇన్ పోలీస్ ఇన్విస్టిగేషన్’ అవార్డులు వరించినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం ప్రకటించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబర్చిన పోలీసులకు ఏటా ఈ అవార్డులు అందజేస్తుంటారు. 2018 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా 96 మందికి అవార్డులు దక్కాయి. మోహన్ కుమార్ ప్రస్తుతం సౌత్ జోన్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.