
పద్మారావునగర్, వెలుగు: ముదిరాజ్లకు పూర్తిగా అండగా ఉంటామని, వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి నామాలగుండులో ముదిరాజ్ల దసరా సమ్మేళనం అలయ్ బలయ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కిషన్రెడ్డి హాజరై మాట్లాడారు.
ముదిరాజ్లకు చట్ట సభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ గౌరవం తప్పకుండా దక్కేవిధంగా తాము కృషి చేస్తామన్నారు. ముదిరాజ్లు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్గౌడ్, నాయకులు మేకల సారంగపాణి, శంకర్, ఆకారం రమేశ్, మేకల హర్షకిరన్, లక్ష్మన్ తదిరతులు పాల్గొన్నారు.