సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో యోగా సెషన్

సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో యోగా సెషన్

జూన్ 21న ఎనిమిదో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ రైల్వే యోగా సెషన్ ను నిర్వహించింది. ముంబయిలోని శివాజీ మహరాజ్ టర్మినస్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమలో వివిధ ఆసనాలు వేశారు. ఇకపోతే యోగా డే సమీపస్తున్న తరుణంలో దేశంలోని 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో నిర్వహించే యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు75 మంది మంత్రులను నియమించారు. అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్‌లో యోగా చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ రోజున మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రసిద్ధ జ్యోతిర్లింగ త్రయంబకేశ్వర్ ఆలయ సముదాయంలో హోంమంత్రి అమిత్ షా, తమిళనాడులోని కోయంబత్తూరులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. అక్కడ నిర్వహించే యోగా కార్యక్రమాలలో పాల్గొననున్నారు.