ఆందోళన ఆపేయాలి.. లేకపోతే అందరిని అరెస్ట్ చేస్తాం: డీసీపీ వెంకటేశ్వర్లు

ఆందోళన ఆపేయాలి.. లేకపోతే అందరిని అరెస్ట్ చేస్తాం: డీసీపీ వెంకటేశ్వర్లు

TSPSC కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న అభ్యర్థులతో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మరికాసేపట్లో ఆందోళన ఆపేయాలని ఆదేశించారు. లేకపోతే ఆందోళన చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. అభ్యర్థులందరినీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని డీసీపీ తెలిపారు. 48 గంటల్లో TSPSC నుండి అభ్యర్థులకు అనుకూలమైన ప్రకటన వస్తుందని డీసీపీ చెప్పారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం, TSPSC పై అభ్యర్థులు నమ్మకం లేదంటున్నారు. మంత్రి కేటీఆర్ లేదా బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఇక్కడికి వచ్చి.. మాకు భరోసా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్2 వాయిదా వేస్తున్నట్లు లిఖీతపూర్వక ప్రకటన ఇస్తే తప్పా.. ఇక్కడి నుండి కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు.