ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఓఎల్ఎస్ సర్వే కోసం కేంద్ర రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారులు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు శుక్రవారం విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో ఇన్చార్జ్ కలెక్టర్ యువరాజ్మర్మట్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అనుకూలతలపై సర్వేను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశంలో ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

