
మెహిదీపట్నం/ ఇబ్రహీంపట్నం, వెలుగు : సిటీలో ఆదివారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒక్కరోజే ఇద్దరు వృద్ధురాళ్ల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. మెహిదీపట్నం పరిధిలోని విజయనగర్ కాలనీకి చెందిన చంద్రకళ (65) రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం వాకింగ్కువెళ్లింది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వెనుక నుంచివచ్చి ఆమె మెడలోని ఒకటిన్నర తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు.
అలాగే ఇబ్రహీంపట్నంలోని మంచాల్ రోడ్డులోనూ చైన్స్నాచింగ్జరిగింది. నోముల గ్రామానికి చెందిన మాదరమోని లక్ష్మమ్మ(70) ఆకుకూరల మార్కెట్ నుంచి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమె మెడలోని సుమారు 3 తులాల పుస్తెలతాడును దుండగులు కొట్టేశారు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.