జూన్ 17న చలో ఇందిరాపార్క్.. రజక వృత్తిదారుల సంఘం పిలుపు

జూన్ 17న చలో ఇందిరాపార్క్.. రజక వృత్తిదారుల సంఘం పిలుపు

మేడిపల్లి, వెలుగు: రజకులకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకం బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా చెల్లించడం లేదని రజక వృత్తిదారుల సంఘం నేతలు ఆరోపించారు. దీంతో విద్యుత్ అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. సమస్య పరిష్కారానికి ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ధర్నాకు రజకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు అంబే చక్రపాణి, శ్రీనివాస్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.