కాంగ్రెస్​ ప్రకటనలపై బీఆర్​ఎస్​, బీజేపీ కుట్ర : చామల కిరణ్​

కాంగ్రెస్​ ప్రకటనలపై బీఆర్​ఎస్​, బీజేపీ కుట్ర : చామల కిరణ్​

హైదరాబాద్, వెలుగు: తొమ్మిదన్నరేండ్ల బీఆర్​ఎస్​ దరిద్ర పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​చామల కిరణ్  కుమార్​ రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్, బీజేపీ కావాలని కాంగ్రెస్​ ప్రకటనలపై నిషేధం విధించేలా ఎన్నికల కమిషన్​ మీద ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు.  సోమవారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

మీడియా సర్టిఫికేషన్​ మానిటరింగ్​ కమిటీ (ఎంసీఎంసీ) సర్టిఫికేట్​ ఇచ్చిన యాడ్స్​ను ఆపాలనడం సరి కాదన్నారు. ఓటమి భయంతోనే ప్రశాంత్​ కిషోర్​తో కలిసి బీఆర్​ఎస్​ ఇలాంటి నాటకాలు ఆడుతున్నదని మండిపడ్డారు. 

ALSO READ : హామీలను మరిచిన నాయకులను నిలదీయండి : దినేశ్ కులాచారి​

మెట్రో యాడ్స్​ రాకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. ప్రకటనలు ఆపినంత మాత్రాన ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి పోదని చెప్పారు.   ఈసీతో న్యాయం జరగకపోతే కోర్టుకు పోతామని స్పష్టం చేశారు.