హామీలను మరిచిన నాయకులను నిలదీయండి : దినేశ్ కులాచారి​

హామీలను మరిచిన నాయకులను నిలదీయండి : దినేశ్ కులాచారి​

నిజామాబాద్​రూరల్, వెలుగు: గత ఎన్నికల్లో లెక్కకు మించి హామీలిచ్చి అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయిన అధికార పార్టీ లీడర్లను నిలదీయాలని రూరల్​ బీజేపీ అభ్యర్థి దినేశ్ కులాచారి​పేర్కొన్నారు. సోమవారం మోపాల్​ మండలం న్యాల్​కల్, ముదక్ పల్లి, రామేశ్వర్​పూర్​ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా దినేశ్​మాట్లాడుతూ.. రూరల్​నుంచి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్​తన ఆస్తులు పెంచుకోవడం తప్పా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఆదరించి అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్​పద్మారెడ్డి, లీడర్లు రవి, నవీన్, వినోద్​పాల్గొన్నారు. 

ALSO READ : నర్సంపేటకు రింగురోడ్డు మంజూరు చేస్తా : కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌