
చందానగర్, వెలుగు: చందానగర్లోని గంగారం జాతీయ రహదారి వెంట ఉన్న ఖజానా జ్యువెలరీ షాప్లో జరిగిన దోపిడీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న ఖజానా జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆరుగురు దుండగులు ముఖానికి మాస్కులు ధరించి, గన్స్తో చొరబడ్డారు.
డిస్ప్లేలలో ఉన్నవి బంగారు ఆభరణాలు అనుకొని బంగారు పూత ఉన్న 10 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఈ నెల 16న బిహార్కు చెందిన ఇద్దరు నిందితులు ఆశిష్కుమార్సింగ్, దీపక్కుమార్సాహాను మహారాష్ర్టలోని పుణేలో అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 900 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బిహార్కే చెందిన అనీష్కుమార్సింగ్, ప్రిన్స్కుమార్ రజక్ను పుణేలోని చాకన్, పింప్రిలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక పిస్టల్, 1,015 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ఎస్ వోటీ, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.