మన దేశం పేరు ఏంటీ.. ఇండియానా.. భారత్ నా.. ఒక దేశానికి రెండు పేర్లు అవసరమా.. ఎందుకు రెండు పేర్లు ఉన్నాయి.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టారని.. భారతదేశం అనేది మనం పెట్టుకున్న పేరు అని.. ఇప్పుడు ఇండియాను.. భారత్ గా మార్చాలని.. ప్రపంచం మొత్తం మన దేశాన్ని భారత్ గా పిలవాలని.. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్.
దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చాలని, తక్షణమే భారత రాజ్యాంగం నుంచి దాన్ని తొలగించాలని బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. 'ఇండియా' అనే పదాన్ని బ్రిటిష్ వారు ఉపయోగించేవారని హరనాథ్ సింగ్ యాదవ్ అన్నారు. 'ఇండియా' అనే పదానికి బదులుగా 'భారత్' అనే పదాన్ని ఉపయోగించాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తోంది... 'ఇండియా' అనే పదం బ్రిటిష్ వారు తీసుకువచ్చింది. 'భారత్' అనే పదం మన సంస్కృతికి ప్రతీక.. మన రాజ్యాంగంలో మార్పు రావాలని, దానికి 'భారత్' అనే పదాన్ని చేర్చాలని కోరుకుంటున్నాను అని హరనాథ్ సింగ్ చెప్పారు.
ఇటీవల ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏతో తలపడాలని యోచిస్తున్న 28 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. భారతదేశం పేరును భారత్గా మార్చడంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గతంలో ఇదే విధమైన ప్రకటన చేశారు. ప్రజలు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకున్నా మనం ‘ఇండియా’ అనకూడదని, ‘భారత్’ అని చెప్పాలని మోహన్ భగవత్ అన్నారు. అంతేకాకుండా, బీజేపీ పార్లమెంటు సభ్యుడు నరేష్ బన్సాల్ కూడా ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు.
#WATCH | BJP MP Harnath Singh Yadav says "The entire country is demanding that we should use the word 'Bharat' instead of 'India'...The word 'India' is an abuse given to us by the British whereas the word 'Bharat' is a symbol of our culture...I want there should be a change in… pic.twitter.com/TkOl3Ieuer
— ANI (@ANI) September 5, 2023
హరినాథ్ సింగ్ యాదవ్ డిమాండ్ ఏమిటంటే..?
"నేను ఈ ప్రచారాన్ని నిర్వహించడం లేదు. దేశం మొత్తం దీన్ని డిమాండ్ చేస్తోంది. ఈ సెంటిమెంట్ అన్ని దేశంలోని ప్రాంతాలకూ ఉంది. RSSచీఫ్ మోహన్ భగవత్ కూడా దీన్ని "భారత్" అని పిలవాలని, వేరే పేరు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. "భారత్" అనేది అభిరుచితో నిండిన పదం. ఇది సజీవ పదం. ఇది మనకు శక్తిని ఇస్తుంది. భక్తి భావం దానితోనే ముడిపడి ఉంటుంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాదు. అని బీజేపీ పార్లమెంటు సభ్యుడు హరినాథ్ సింగ్ యాదవ్ అన్నారు. "బ్రిటీష్ వాళ్ళ దృష్టిలో మనది అజ్ఞాన సమాజం. ఎక్కడైతే మనుషులు అమాయకులు, నేరపూరిత మనస్తత్వం కలవారు, మూర్ఖులు అని భావించారో అక్కడ వారు "ఇండియా" అనే పదాన్ని ఉపయోగించారు. ఇక్కడ అలాంటి మనస్తత్వం ఉన్నవారు ఇతరులను తప్పుదోవ పట్టిస్తారు. ఆంగ్లేయులు సింధు నది ద్వారా వచ్చారు. కావున వారు "సింధ్" అని చెప్పకుండా... బదులుగా "ఇండియా" అని అన్నారు. అందుకే, క్రమంగా, అది "ఇండ్".. "ఇండియా" గా మారింద"ని హరనాథ్ చెప్పారు.
- ALSO READ: మోదీ.. ఒక్క లీవ్ కూడా తీసుకోలె
రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ అనే పదాన్ని తొలగించాలని బీజేపీ ఎంపీ చేసిన డిమాండ్పై కాంగ్రెస్ నేత జయరామ్ రమేశ్ స్పందించారు. ఈ పరిణామం వెనుక కొంతైనా నిజం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి భవన్ సెప్టెంబరు 9న విందుకు ఆహ్వానాన్ని పంపిందని, అందులో "ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా" అని కాకుండా "ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా" అని తెలిపింది. "ఇప్పుడు, మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 చదవవచ్చు: "భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్గా ఉంటుంది. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్" అనే పదం కూడా ఇప్పుడు దాడికి గురవుతోంది" అని ఆయన ఆరోపించారు.