
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు విశేషస్పందన లభిస్తోంది. హేమకుండ్ సాహిబ్తో సహా పవిత్ర స్థలాలకు 1.6 మిలియన్లకు పైగా భక్తులు సందర్శించారు. కేదార్నాథ్ ధామ్ ప్రారంభమైన 30 రోజుల్లో 6లక్షల 50వేలమందికి పైగా సందర్శకులు వచ్చారు. గంగోత్రి ,యమునోత్రి ప్రారంభంతో ప్రారంభమైన వార్షిక తీర్థయాత్ర..ఆధ్యాత్మిక సంతృప్తిని కోరుకునే యాత్రికులను ఆకర్షిస్తోంది.
కేదార్నాథ్ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.ఆలయం తెరిచిన కొన్ని వారాల్లోనే రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించారు. ఆదివారం (జూన్1) నాటికి కేదార్ నాథ్ ధామ్ ను సందర్శించే భక్తుల సంఖ్య 7లక్షలు దాటింది. కేదార్ నాథ్ సహా చార్ధామ్ యాత్రలో ఈ యేడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ 30 నుంచి 7.17 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.
మే 2న బాబా కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరిచినప్పటి నుంచి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య 7 లక్షలు దాటింది.మే 31 నాటికి గుర్రాలు ,గాడిదలు ద్వారా సుమారు 1లక్షా39వేల444 మంది యాత్రికులు దర్శనం కోసం చేరుకున్నారని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ ఆశిష్ రావత్ తెలిపారు.
ఈయేడాది కేదార్నాథ్ ధామ్ యాత్రికుల కోసం ఆలయం తలుపులు తెరిచి దాదాపు నెల రోజులు దాటింది. ఆదివారం నాడు యాత్రికుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. సగటున రోజుకు దాదాపు 24వేల మంది యాత్రికులు వస్తున్నారు. ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కేదార్నాథ్ ధామ్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయ పర్వత పాదాల దగ్గర మందాకిని నది ఒడ్డున ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.చార్ ధామ్ యాత్ర హిందూ మతంలో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఉంది.
చార్ ధామ్ యాత్ర ఏప్రిల్-మే లో మొదలై అక్టోబర్-నవంబర్ వరకు సాగుతుంది. చార్ ధామ్ యాత్రను సవ్యదిశలో పూర్తి చేయాలని భక్తులు కోరుకుంటారు. అందువల్ల తీర్థయాత్ర యమునోత్రి నుంచి ప్రారంభించి గంగోత్రి వైపు, కేదార్నాథ్కు వెళ్లి, చివరకు బద్రీనాథ్లో ముగుస్తుంది.