- 12 కిలోల వెండి, 100 ఎల్ఈడీ టీవీలు స్వాధీనం
నేరెడ్మెట్, వెలుగు: లక్కీ డ్రా పేరుతో 3వేల మందిని మోసం చేసిన ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 25 లక్షల విలువైన12 కిలోల సిల్వర్ కాయిన్స్, 100 ఎల్ఈడీ టీవీలు, 5సెల్ఫోన్లు, లక్కీడ్రా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈసీఐఎల్కు చెందిన షేక్ సలావుద్దీన్(38), సాహెబ్ మీర్ఖాన్(43) ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి 2020లో మీర్పేట హెచ్ బీ కాలనీలో ఫేక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో నైస్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేశారు. లక్కీడ్రా స్కీం పేరుతో నెలకు వెయ్యి చొప్పున కడితే ఏదో ఒక గిఫ్ట్ కచ్చితంగా వస్తుందని జనాన్ని నమ్మించారు. 3 వేల మంది నుంచి 16 నెలలపాటు రూ.4.8కోట్లు వసూలు చేశారు. తర్వాత తప్పించుకుని తిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో మల్కాజిగిరి ఎస్ ఓటీ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.