వయసుతో పనిలేకుండా మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, ఇంట్లో దొరికే పదార్థాలతోనే మొటిమలు రాకుండా చేయొచ్చు. ముఖంపై మచ్చలు పడకుండా జాగ్రత్తపడొచ్చు. కలబందలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మొటిమల్ని పోగొడతాయి. కలబంద గుజ్జును మచ్చలమీద మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని చల్లనినీళ్లతో కడగాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు పోతాయి. కలబంద గుజ్జులో మూడు చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలిపి, మచ్చలపైన రాసి పావుగంట తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెలోని యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ యాక్నే సమస్యను దూరం చేస్తాయి. మొటిమల వల్ల వచ్చే మచ్చలకు తేనె చెక్ పెడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మొటిమలపై తేనె రాసి టిష్యూ వేసుకుని పడుకోవాలి. తెల్లారాక గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా 2 – 3 యాస్ప్రిన్ మాత్రలు పొడిచేసి, అందులో రెండు టీస్పూన్ల తేనె కలిపి మొటిమలపై రాయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. రోజుకోసారి ఇలా చేస్తే ముఖంపై మొటిమలు పోతాయి.
మొటిమలకు కలబందతో చెక్
- లైఫ్
- July 11, 2022
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు