వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్
  • పాల్గొన్న కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్​/జైపూర్, వెలుగు : మందమర్రి, జైపూర్, భీమారం మండలాల్లో జరిగిన పలు వివాహ వేడుకలకు  చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్​వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హాజరయ్యారు. గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్​ఆర్​ గార్డెన్స్​లో జరిగిన చిర్రకుంట మాజీ సర్పంచ్ ఓడ్నాల కొమురయ్య మేనకోడలు తేజశ్రీ-–అభినవ్​ యాదవ్ పెండ్లి వేడుకల్లో పాల్గొని వధువరులు ఆశీర్వదించారు.

అమ్మ గార్డెన్స్​లో జరిగిన బెల్లంపల్లి మున్సిపల్​ మాజీ చైర్మన్​ ఎం.సూరిబాబు బంధువు సంహిత–-వినోద్​వధూవరులు, బూరుగుపల్లిలో జరిగిన భీమారం జడ్పీటీసీ లక్ష్మణ్​​ అన్న కూతురు కల్యాణి–-దేవేందర్ వివాహ వేడుకలో పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. జైపూర్ మండలంలో రామారావుపేటలో రజకుల ఆరాధ్య దైవమైన మడేలయ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలకు సైతం హాజరయ్యారు. ఆలయంలో పూజలు చేశారు.  

ఫ్రీ కరెంటు వర్తింపుపై ఆరా..

కాంగ్రెస్​ సర్కార్ ​అమలు చేస్తున్న 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీం లబ్ధిదారులందరికి వర్తించే విషయంపై ఎమ్మెల్యే వివేక్​ ఆరా తీశారు. గురువారం రాత్రి భీమారం మండలం పోతనపల్లి, కాజీపెల్లి గ్రామాల్లో పర్యాటించిన ఆయన మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ​

భీమారం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దాసరి లక్ష్మి, మండల కేంద్రంలో చనిపోయిన పుట్ట బుచ్చమ్మ కుటుంబాలను గురువారం రాత్రి ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీ ప్రతాప్, బండి సదానందం, ఓడ్నాల శ్రీనివాస్, గుడ్ల రమేశ్, ముక్తి శ్రీనివాస్, రాయబారపు కిరణ్, భీమారం జడ్పీటీసీ భూక్య తిరుమల, పలువురు లీడర్లు పాల్గొన్నారు.