బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
  • బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
  • మొయినాబాద్​లో ఎన్నికల ప్రచారం

చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి జరుగుతుందని చేవెళ్ల బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మొయినాబాద్ మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. చందానగర్, కుతుబుద్దీన్ గూడ, ఎల్కగూడ గ్రామాల్లో పర్యటించారు. మహిళలు యాదయ్యకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. 

ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జనం ముందుకు వచ్చి అడ్డగోలుహామీలు ఇచ్చే నాయకులను నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ నేతలు 70 ఏండ్లుగా మాయమాటలు చెబుతూనే ఉన్నారన్నారు.

ఈ ఎన్నికల్లోనూ చేవెళ్ల సెగ్మెంట్ ఓటర్లు తనకు అండగా నిలుస్తారని ఆయనఆశాభావం వ్యక్తం చేశారు. కాలె యాదయ్య వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.