రూ.3 కోట్ల టమాట పంట పండించిన రైతును అభినందించిన కేసీఆర్

రూ.3 కోట్ల టమాట పంట పండించిన రైతును అభినందించిన కేసీఆర్

టమోటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి. కిలో టమోట 120 నుంచి 160 రూపాయల వరకు అమ్ముతున్నారు. మూడు కోట్ల రూపాయల టమాటా పంట పండించిన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సోమవారం (జులై 24న) మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో వచ్చిన రైతు మహిపాల్ రెడ్డి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇప్పటికే రూ.2 కోట్ల విలువ చేసే టమాటా పంటను అమ్మామని, మరో కోటి రూపాయల పంట కోతకు సిద్ధంగా ఉందని మహిపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వివరించారు. వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.