సాయుధ బలగాలపై రాజకీయాలు దేశానికే చేటు

సాయుధ బలగాలపై రాజకీయాలు దేశానికే చేటు

లోక్ సభ ఎన్నికల వేళ ఆర్మీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడాన్ని నివారించాలంటూ156 మంది మాజీ ఉద్యోగులు శుక్రవారం రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనంగా మారింది. లేఖరాసిన వారంతా కల్నల్, ఆ పైస్థాయి ర్యాంకుల్లోరిటైరైన వారే. అందులో ఎనిమిది మంది మాజీచీఫ్ ఆఫ్ స్టాఫ్ లు కూడా ఉండటం గమనార్హం.త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ల పేరు చెప్పుకొని ఓట్లు అడగటం ఆక్షేపణీయమని మాజీలు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ నేతలు,పార్టీల తీరుతో బలగాల ప్రతిష్ట ప్రమాదంలోపడిందని, రాజకీయేతర వ్యవస్థలుగా వాటినిపరిరక్షించాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు.అయితే, మాజీ అధికారులు రాసినట్లుగా చెబుతున్న లేఖ అందలేదని రాష్ట్రపతి భవన్ ప్రకటించడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.తమ సమ్మతి లేకుండా ప్రకటన వెలువడిందనిలేఖలో సంతకాలు చేసిన ముగ్గురు మాజీలు రచ్చకెక్కడంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మోడీని బ్లేమ్ చేయడానికి కాంగ్రెస్​ ఫేక్ లెటర్ సృష్టించిందని రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ ఆరోపించారు. కాగా, ముగ్గురు తప్ప లేఖపై సంతకాలు చేసిన మిగతా వెటరన్స్​ అందరూ ప్రకటనతో సమ్మతిస్తున్నట్లు చెప్పడంగమనార్హం. ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంపై దృష్టి సారించాలంటూ 66 మంది మాజీ బ్యూరోక్రాట్లు మూడురోజుల కిందట రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతితెలిసిందే.

మోడీకి చెంపపెట్టు..కాదు ఫేక్ లెటర్  సైనికాధికారుల లేఖ ప్రధాని మోడీకి చెంపపెట్టు లాంటిదన్న కాంగ్రెస్ పార్టీ, ఓట్ల కోసం మోడీసైనికుల్ని వాడుకోవాలనుకున్నా, సైన్యం మాత్రందేశంవైపే నిలబడిందని పేర్కొం ది. రాష్ట్రపతిభవన్ మాత్రం మాజీ సైనికాధికారుల లేఖలేవీతమకు అందలేదని ప్రకటించింది. భవన్ ప్రకటనను ఉటంకిస్తూ, ‘ఇది కాంగ్రెస్​ సృష్టించి న ఫేక్లెటర్ ’అని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ఆరోపించారు.

మా పర్మి షన్ తీసుకోలేదు

లేఖలో పేర్లున్న 156 మంది సైనికాధికారుల్లోముగ్గురు తప్ప మిగతావాళ్లంతా అందులోనిఅంశాలతో సమ్మతిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఒకసైనికుడిగా నాకు దేశమే ముఖ్యం. అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటాను. లేఖలో నా పేరుఎలా వచ్చిందో అర్థం కావట్లేదు” అని ఆర్మీ మాజీచీఫ్ జనరల్​ ఎస్​ఎఫ్ రొ డ్రిగోస్​ అన్నారు. మాజీఎయిర్ చీఫ్ మార్షల్​ ఎన్ సీ సూరి స్పం దిస్తూ,‘‘నాకు తెల్సినంతవరకు నేవీ మాజీ చీఫ్ రాందాస్​ ఈ లేఖ రాయలేదు. బహుశా మేజర్ చౌదరి అయిఉంటారు. లెటర్ ని వాట్సాప్ , జీమెయిల్​లో మా-కందరికీ పంపారు. కానీ అందులోని అంశాలతో నేను విభేదిస్తున్నా”అని చెప్పారు

దేశ సమగ్రతకు ముప్పు

త్రివిధ దళాల సుప్రీం కమాండర్ కూడా అయినందునే రాష్ట్రపతికి నేరుగా లేఖ రాస్తున్నట్లు మాజీసైనిక ఉద్యోగులు పేర్కొన్నారు. ఆర్మీని పొలిటిసైజ్ చేస్తున్న తీరును, దాని వల్ల తలెత్తే ప్రమాదాలనువివరించే ప్రయత్నం చేశారు. ‘‘కోవింద్ జీ, కొందరు రాజకీయ నేతలు అసాధారణ రీతిలో ఆర్మీఆపరేషన్స్​ను ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇంకొం దరైతే ఆర్మీని ‘మోడీ సేన’గా అభివర్ణిం చారు. ఎన్నికల ప్రచారంలో సైనిక దుస్తులు, పోస్టర్లను వాడుకోవడం, వింగ్​ కమాండర్ అభినందన్ఫొటోల్ని ప్రచురించడం లాంటివి ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. సాయుధ బలగాలపైరాజకీయాలు ప్రతికూలతలకు దారితీస్తాయి. ఇలాంటి చర్యల వల్ల కుల, మత, లింగ, ప్రాంతీయబేధం లేకుండా దేశమే ఊపిరిగా పనిచేస్తున్న జవాన్ల స్థైర్యం దెబ్బతింటుం ది. లౌకిక భావజాలంలోపిస్తే అంతిమంగా అది జాతీయ భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు కలిగించే ప్రమాదం ఉంది.రాజకీయాలకు సంబంధలేని వ్యవస్థలుగా త్రివిధ దళాల సహజ స్వభావాన్ని పరిరక్షించండి. ఆమేరకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యాన్నివాడుకునే వ్యక్తులు లేదా పార్టీలకు తక్షణమే నిర్దేశం చేయాలని కోరుతున్నాం ”అని లేఖలో రాసుకొచ్చారు