బిల్డింగ్ పైనుంచి కిందపడి మూడేండ్ల చిన్నారి మృతి

బిల్డింగ్ పైనుంచి కిందపడి మూడేండ్ల చిన్నారి మృతి

శంకర్​పల్లి, వెలుగు: బిల్డింగ్ పై నుంచి కిందపడి మూడేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్​పరిధిలో జరిగింది. సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మండలం దొంతాన్​పల్లి గ్రామానికి చెందిన రుద్రగిరి సింగ్, రేష్మికుమారి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రుద్రగిరి సింగ్ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. గురువారం సాయంత్రం అతని రెండో కూతురు ఇషిక(3) ఆడుకుంటూ బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తు టెర్రస్​పైకి వెళ్లింది. ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారి కిందపడింది. పెద్దగా శబ్దం రావడాన్ని గమనించిన రేష్మి బయటికి వచ్చి చూడగా.. గ్రౌండ్​ ఫ్లోర్​లో ఇషిక గాయాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే శంకర్​పల్లిలోని ఓ హాస్పిటల్​కు తీసుకెళ్లింది. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ ఇషిక శుక్రవారం ఉదయం చనిపోయింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.