
హైదరాబాద్సిటీ, వెలుగ: పేట్లబుర్జులోని సిటీ ఆర్ముడ్రిజర్వ్ఆఫీసులో పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేసిన శిశు సంరక్షణా కేంద్రం (క్రెష్)ను సిటీ సీపీ సీవీ ఆనంద్ బుధవారం ప్రారంభించారు. పోలీస్డ్యూటీలు, బందోబస్తుల కారణంగా ఎక్కువ టైమ్ ఫీల్డ్లో ఉండే మహిళా అధికారులు, సిబ్బందికి ఈ శిశు సంరక్షణ కేంద్రం బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇందులో సిటీ పోలీస్శాఖకు చెందిన ఎవరైనా ఆడ, మగా తేడా లేకుండా పిల్లలను చేర్పించవచ్చన్నారు.
ఇండోర్, అవుట్ డోర్ ప్లే ఏరియాలు, ఊయలలు, ఫీడింగ్ రూమ్స్, మెడికల్ రూమ్స్, గర్భిణుల కోసం డార్మిటరీ ఉన్నాయన్నారు. ఐదేండ్ల వయస్సున్న 150- నుంచి 200 మంది పిల్లలకు వసతి సౌకర్యం ఉంటుందన్నారు. పిల్లలకు ఆహారం అందించడానికి స్పెషల్కిచెన్ఉందని, ట్రైనింగ్పొందిన ఎక్స్పర్ట్స్పిల్లలను చూసుకుంటారన్నారు. బిల్డింగ్నిర్మాణానికి సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ఈ ప్రాజెక్టును మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సీఎస్ఆర్లో భాగంగా చేపట్టారన్నారు. అడిషనల్సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్జాయింట్సీపీ జోయల్ డెవిస్, సౌత్ఈస్ట్జోన్డీసీపీ చైతన్య కుమార్, మెఘా ఇంజినీరింగ్ నుంచి పామిరెడ్డి మంజులా రెడ్డి, పామిరెడ్డి మెఘా రెడ్డి, మురళీ మెఘా పాల్గొన్నారు.