ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే దిశలో చైనా ముందుకు వెళ్తోంది. చైనాకు చెందిన క్యాన్సినో బయోలాజిక్స్, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి అభివృద్ధి చేసిన ‘క్యాన్సినో’ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ కొవిడ్ 19 టీకా Ad5-nCOV కు గానూ చైనా పేటెంట్ హక్కులు పొందింది.
ఆ దేశానికి చెందిన ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రెగ్యులేటర్ దగ్గర లభ్యమైన పేపర్ల ఆధారంగా అక్కడి మీడియా ఈ వివరాలను తెలిపింది. కొవిడ్-19 టీకాకు పేటెంట్ పొందిన మొట్టమొదటి సంస్థ క్యాన్సినో అని, బీజింగ్ ఆ హక్కులను ఆగస్టు 11నే జారీ చేసిందని చెప్పింది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ట్రయల్స్ కోసం పలు దేశాలతో చైనా చర్చలు జరుపుతోంది.

