చైనా యుద్ధానికి సిద్ధమవుతున్న విషయాన్ని కేంద్రం దాచిపెడుతోంది : రాహుల్ గాంధీ

చైనా యుద్ధానికి సిద్ధమవుతున్న విషయాన్ని కేంద్రం దాచిపెడుతోంది : రాహుల్ గాంధీ

అరుణాచల్, లడఖ్ రెండు వైపుల నుంచి యుద్ధానికి చైనా సిద్ధమవుతోందని, గాఢనిద్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వాస్తవాన్ని కేంద్ర ఫ్రభుత్వం దాచిపెడుతోందన్నారు. చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. “నేను గత రెండు, మూడు సంవత్సరాలుగా ఇదే చెబుతున్నాను. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముప్పును కేంద్ర ప్రభుత్వం దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి విషయాలను ఎక్కువ కాలం దాచలేం” అని రాహుల్ గాంధీ  అన్నారు. 

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ సమీపంలోని యాంగ్‌స్టే ప్రాంతంలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో కొనసాగుతోంది.