వాషింగ్టన్: డబ్ల్యూహెచ్వో కోరినా .. చైనా అధికారులు కరోనా జెనెటిక్ మ్యాప్, జీనోమ్ కు సంబంధించిన వివరాలు ఇవ్వడంలో ఆలస్యం చేశారట. చైనా ప్రభుత్వ ల్యాబ్స్ జెనెటిక్ మ్యాప్ను పూర్తిగా డీకోడ్ చేసిన తర్వాత కూడా ఆ డేటాను డబ్ల్యూహెచ్వోతో వెంటనే షేర్ చేసుకోలేదట. యూఎన్ ఇంటర్నల్ మీటింగ్స్లో ఈ విషయంపై చాలా సార్లు చర్చ జరిగినట్టు సమాచారం. తమకు కావాల్సిన సమాచారాన్ని చైనా ఇవ్వలేదని డబ్ల్యూహెచ్వో అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. వైరస్ కు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేసినట్టు రికార్డుల్లో పేర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో కరోనా వైరస్ ను వూహాన్ లో గుర్తించారు. వాస్తవానికి జనవరిలో కరోనా వైరస్ విషయంలో చైనా రెస్పాన్స్పై పబ్లిక్ గానే డబ్ల్యూహెచ్వో మెచ్చుకుంది. వైరస్ జెనెటిక్ మ్యాప్ను రిలీజ్ చేసే విషయంలో వెంటనే స్పందించిందంటూ థ్యాంక్స్ కూడా చెప్పింది. చైనా కరోనా సమాచారాన్ని ముందుగా షేర్ చేయలేదంటూ అమెరికా సహా చాలా దేశాలు విమర్శలు చేశాయి. అయినా డబ్ల్యూహెచ్వో చైనానే వెనకేసుకొచ్చింది. చైనాకు సపోర్ట్ చేస్తోందనే కారణంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ డబ్ల్యూహెచ్వోతో సంబంధాలను కట్చేసుకున్నారు. అయితే చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ మాత్రం తమ దేశం కరోనా సమాచారాన్ని డబ్ల్యూహెచ్వోకు పూర్తిగా అందించిందని చెప్పుకొచ్చారు.
గేట్స్ ఫౌండేషన్ నిధులే దిక్కు
కరోనా విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే కారణంతో డబ్ల్యూహెచ్వోకు అమెరికా సహా చాలా దేశాలు ఫండింగ్ నిలిపేశాయి. ఇప్పటి వరకూ డబ్ల్యూహెచ్వోకు ఎక్కువ నిధులు అమెరికా నుంచే అందుతున్నాయి. ఆ తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి ఎక్కువ ఫండ్స్ దక్కుతున్నాయి. అమెరికా పూర్తిగా నిధులు ఇవ్వడం నిలిపేయడంతో ఇప్పుడు డబ్ల్యూహెచ్వోకు గేట్స్ ఫౌండేషనే అతి పెద్ద స్పాన్సరర్గా నిలిచింది. 2019లో అమెరికా నుంచి 893 మిలియన్ డాలర్ల నిధులు వస్తే.. గేట్స్ ఫౌండేషన్ నుంచి 531 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. అమెరికా నిధులు ఆపేయడంతో ఇప్పుడు డబ్ల్యూహెచ్వోకుఎక్కువ డబ్బులిస్తున్న జాబితాలో గేట్స్ ఫౌండేషన్ మొదటి ప్లేస్లో నిలవనుంది.
ఎల్ఏసీ దగ్గర పెద్ద ఎత్తున చైనా బలగాలు