చింగ్స్​.. ఇక టాటా బ్రాండ్

చింగ్స్​.. ఇక టాటా బ్రాండ్
  •      ఆర్గానిక్​ ఇండియా కూడా 

న్యూఢిల్లీ :  చింగ్స్ సీక్రెట్,  స్మిత్ అండ్​ జోన్స్ పేరుతో నూడుల్స్​, చట్నీలు, మసాలాలు, సాస్​ల​ వంటి ప్రొడక్టులు అమ్మే  క్యాపిటల్ ఫుడ్స్‌‌లో పూర్తి 100శాతం వాటాను కొనుగోలు చేసినట్లు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రకటించింది. ఈ క్యాష్​ డీల్​ విలువ రూ.5,100 కోట్లు.  కంపెనీ తొలుత ఈక్విటీ షేర్‌‌ హోల్డింగ్‌‌లో 75 శాతాన్ని కొనుగోలు చేస్తుంది. మిగిలిన 25 శాతం వాటాను తదుపరి మూడేళ్లలో కొనుగోలు చేస్తామని టాటా తెలిపింది.  

క్యాపిటల్ ఫుడ్స్‌  ఫౌండర్​అజయ్ గుప్తాకు సంస్థలో 9.45 శాతం వాటా ఉంది. మిగిలిన యాజమాన్యం ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ జనరల్ అట్లాంటిక్,  అర్టల్ ఏషియా చేతుల్లో ఉంది. క్యాపిటల్ ఫుడ్స్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.750 నుండి రూ.770 కోట్లు టర్నోవర్ సాధించవచ్చని అంచనా.  ఇదిలా ఉంటే ఆర్గానిక్​ టీలు, హెల్త్​కేర్​ ప్రొడక్టులను తయారు చేసే ఆర్గానిక్​ ఇండియానూ టాటాలు సొంతం చేసుకోనుంది.