రాజకీయాల్లో విభిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ.. భగవంతుడి వద్దకు అందరూ కలిసి రావాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు. శంషాబాద్ సమీపంలోని మచ్చింతల్ ఆశ్రయమంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల (సమతా మూర్తి) విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం సమతా మూర్తి ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలను దర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రివ్యూ థియేటర్ ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ మాట్లాడుతూ.. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనడం చాలా సంతోషం గా ఉందన్నారు. అమిత్ షా ఇక్కడికి వచ్చి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారని అన్నారు. ఆయన అందరికీ ప్రేరణ ఇచ్చేలా ప్రసంగించారని అన్నారు. రాజకీయాల్లో విభిన్న సిద్ధాంతాలున్నప్పటికీ.. భగవంతుని వద్దకు రావడానికి అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలు వేరైనా దేవుడి ముందు కలిసి రావాలి
- హైదరాబాద్
- February 9, 2022
లేటెస్ట్
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
- మరిన్ని సెక్టార్లలో ఈజీ కానున్న..ఎఫ్డీఐ రూల్స్
- ఫైనల్లో సాత్విక్ చిరాగ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు