విజయవాడ: ప్రముఖ హీరో చిరంజీవి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమా కార్యక్రమాలు తప్ప రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న విషయం తెలిసిందే. స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి పెద్దగా కనపడటం లేదు. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు ప్రకటించిన సందర్భంగా చిరంజీవి గురించి ఆయన స్పష్టత ఇచ్చారు. పెట్రోల్ ధరలపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించారని, జూలై 7 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొంటారా అంటూ పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించి ఆయన పార్టీలో కొనసాగడం లేదన్నారు. తమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయని.. ధరల భారంపై త్వరలో అన్ని జిల్లాల్లో సైకిల్ యాత్రలు చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉమెన్ చాందీ విమర్శించారు.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరు: ఉమెన్ చాందీ
- ఆంధ్రప్రదేశ్
- June 29, 2021
లేటెస్ట్
- నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా?
- ఓటుతో బీజేపీ, కాంగ్రెస్ను తిప్పికొట్టాలి
- కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- శంషాబాద్లో 34.78 కిలోల బంగారం పట్టివేత
- తెలంగాణకి మేం 9 లక్షల కోట్లు ఇచ్చినం : కిషన్ రెడ్డి
- 86 లిక్కర్ బాటిళ్లు, రూ.5 లక్షల క్యాష్ సీజ్
- దేశంలో బీజేపీ పట్టు కోల్పోయింది: శశి థరూర్
- మే6న తెలంగాణకు జస్టిస్ ఘోష్!
- బంజారాహిల్స్ లో ఆఫ్టర్ 9 పబ్బుపై పోలీసుల దాడులు..
- వైభవంగా భద్రేశ్వర రథోత్సవం
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్