క్లోర్​ పైరిఫాస్ డేంజర్​ బెల్స్​ .. దేశంలో ప్రతి 40 సెకన్లకు ఒకరికి బ్రెయిన్​ స్ట్రోక్

క్లోర్​ పైరిఫాస్ డేంజర్​ బెల్స్​ .. దేశంలో ప్రతి 40 సెకన్లకు ఒకరికి బ్రెయిన్​ స్ట్రోక్
  • వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ.. సడెన్​ బ్రెయిన్ స్ట్రోక్స్
  • ప్రతి 4 నిమిషాలకు ఒక  బ్రెయిన్​ స్ట్రోక్​ మరణం
  • ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులు
  • ఇందుకు ప్రధాన కారణం కడుపులో 
  • క్లోర్​ పైరిఫాస్​ అవశేషాలు చేరడమే
  • 40 దేశాల్లో ఇప్పటికే ఈ పురుగు మందుపై నిషేధం
  • మనదేశంలోనూ నిషేధించాలంటూపెరుగుతున్న డిమాండ్లు

హైదరాబాద్​, వెలుగు: కూరగాయలు, పండ్ల తోటల్లో పురుగుమందుగా పిచికారీ చేస్తున్న క్లోర్ ​పైరిఫాస్  డేంజర్​ బెల్స్​ మోగిస్తున్నది. 40కి పైగా దేశాల్లో నిషేధం ఉన్న ఈ పురుగు మందును మన దేశంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా వాడుతున్నారు. మనం పండ్లు, కూరగాయలు తినేటప్పుడు వాటితోపాటు ఈ రసాయన అవశేషాలు కూడా మన కడుపులోకి వెళ్లడంతో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మతిమరుపు, పక్షవాతం, సడెన్​ బ్రెయిన్​ స్ర్టోక్స్​కు కారణమవుతున్నది. 

దేశవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒకరికి బ్రెయిన్​ స్ట్రోక్‌‌ సంభవిస్తుండగా.. ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్​ స్ట్రోక్‌‌ మరణం నమోదవుతున్నదని ఇండియన్​ కౌన్సిల్​ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​(ఐసీఎంఆర్‌‌), గ్లోబల్​ బర్డెన్​ ఆఫ్​ డిసీస్​(జీబీడీ) స్టడీస్​ వెల్లడించాయి. వీటికి ఎక్కువ కారణం క్లోర్​ పైరిఫాస్​ వాడకమేనని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలోనూ అంతకంతకూ పెరుగుతున్న బ్రెయిన్​ స్ట్రోక్‌‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో 2024లో 1,200కు పైగా బ్రెయిన్​ స్ట్రోక్‌‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 30% మంది 45 ఏండ్లలోపు వారే ఉన్నారు. బ్రెయిన్​ స్ట్రోక్​లకు, నాడీ సంబంధ రోగాలకు క్లోర్​ పైరిఫాస్​​ అనే పురుగు మందు అవశేషాలు కారణమవుతుండటంతో దాన్ని భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ నిషేధించాలనే డిమాండ్లు వస్తున్నాయి. 

కడిగి తిన్నా.. ముప్పు తప్పుతలే

రాష్ట్రంలో ఏటా 2 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో కోటికి పైగా ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఉద్యానపంటల వాటా పదిశాతం వర కు ఉంటున్నది. గత వానాకాలం సీజన్​లో 12.96 లక్ష ల ఎకరాల్లో ఉ­ద్యాన పంటలు సాగయ్యాయి. ఇందులో 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా, సుమారు 2 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతున్నది. ఉద్యానపంటలపై క్రిమికీటకాల నివారణకు రైతులు ఎక్కువగా క్లోర్​పైరిఫాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను వాడుతున్నారు.

 ఈ రసాయనం పంటలపై చీడపీడలను నివారిస్తున్నప్పటికీ.. దాని అవశేషాలు కూరగాయలు, పండ్ల ద్వారా మానవ శరీరంలోకి చేరుతున్నాయి. బియ్యం, కూరగాయలు, పండ్ల లోపలికి ఈ అవశేషాలు వెళ్లడం వల్ల.. కడిగి తిన్నా, ఉడికించి తిన్నా నష్టం జరుగుతున్నది. కొన్ని కూరగాయలపై క్లోర్​ పైరిఫాస్​ అవశేషాలు ఎంత కడిగినా, ఉడికించినా పోవని, అలాంటి కూరగాయలను తింటే మరింత ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు.  

పిచికారీ చేసే రైతులపై మరింత ఎఫెక్ట్​

క్లోర్​పైరిఫాస్​ పిచికారీ చేసే రైతులు జాగ్రత్తలు తీసుకోకపోతే వారిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో 2020లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతి లక్ష మందిలో 257 బ్రెయిన్​ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదయ్యాయి. కూరగాయలు, పండ్ల తోటలు ఎక్కువగా సాగుచేసే చాలా మండలాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. క్లోర్​పైరిఫాస్​ ప్రధానంగా నాడీవ్యవస్థపై ఎఫెక్ట్​చూపిస్తుందని, ఈ కెమికల్​శరీరంలో ప్రవేశించగానే రక్తనాళాల్లో అడ్డంకులను సృష్టించి.. స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యరంగ నిపుణులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్న రైతులతో పాటు క్లోర్​  పైరిఫాస్​ అవశేషాలు ఉన్న కూరగాయలను ఎక్కువగా తినే వారిలో బ్రెయిన్​ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముప్పు అనేక రెట్లు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

నిషేధించాలనే డిమాండ్లు

దేశంలో, రాష్ట్రంలో ఎక్కువగా వాడుతున్న పురుగుమందుల్లో క్లోర్​ పైరిఫాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్గానోపాస్ఫేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే రసాయనం ఒకటి. దేశంలో వినియోగిస్తున్న మొత్తం పురుగుమందుల్లో  దీని వాటా సుమారు 10 శాతం ఉంది. తెలంగాణతో పాటు , ఏపీ, యూపీ, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో దీని వినియోగం మరింత ఎక్కువగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 2,58,000 టన్నుల  క్లోర్​పైరిఫాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2022లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తెలంగాణలో క్లోర్​పైరిఫాస్ ఏకంగా 23 పంటలపై వాడుతున్నట్లు  తేలింది. కూరగాయలు, పండ్లపై ఉండే దీని అవశేషాలు మెదడు, నాడీ వ్యవస్థపై దాడి చేస్తున్నట్లు పలు స్టడీస్​తేల్చాయి. 

ఈ రసాయనానికి  దీర్ఘకాలం గురైన వ్యక్తుల్లో బ్రెయిన్​ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మతిమరుపు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. గర్భిణులపై దీని ఎఫెక్ట్​ వల్ల పిండంలో మెదడు లోపాలకు కారణమవుతుందని శాస్త్రీయ ఆధారాలున్నాయి. దీంతో ఏకంగా 40 దేశాలు ఈ రసాయనాన్ని నిషేధించినప్పటికీ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం  వాడుకలో ఉంది. జెనీవాలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 28 నుంచి మే 9 వరకు జరుగుతున్న బాసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రొటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సమావేశాల్లో క్లోర్​పైరిఫాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యానెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏ  కింద లిస్టు చేసి..  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించాలని పెస్టిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ప్యాన్​) డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నది. ఈ రసాయనానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ పురుగుమందులు అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్లోర్​పైరిఫాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగాన్ని నియంత్రిస్తూ, రైతులకు సేంద్రియ పురుగుమందులపై అవగాహన కల్పించాలని  వారు సూచిస్తున్నారు.  

రైతులకు అవగాహన కల్పించాలి

రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, ఆఖరికి వరి పంటపైనా క్లోర్​పైరిఫాస్​ను రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ఈ పురు గు మందును వెంటనే నిషేధించాలి. క్లోర్​పైరిఫాస్​ బ్రెయిన్​ స్ట్రోక్​లకు, ఇతర అనేక వ్యాధులకు కారణమవుతున్నది. చాలా దేశాల్లో దీనిపై నిషేధం విధించినా.. మన దేశంలో వినియోగంలో ఉంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా ఎక్కడ దీనిపై రైతులకు అవగాహన కల్పించడం లేదు. క్లోర్​పైరిఫాస్​తో పాటు మరికొన్ని రసాయనాల అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​