మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. ఢిల్లీలో ఇటీవల నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయగా తాజాగా మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు పంపింది.  ఈ కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్న ఆయనకు  వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించింది సీఐడీ.  2023 అక్టోబర్ 4 బుధవారం రోజున  విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.  నారా లోకేష్ తో కలిసి విచారణకు కావాలని నోటీసుల్లో తెలిపింది.  

Also Read :- వరుసగా సెలవులు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు