TSPSC : నవాబ్ పేటలో సిట్ సోదాలు 

TSPSC : నవాబ్ పేటలో సిట్ సోదాలు 

TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నవాబ్ పేటలో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రశాంత్ అనే వ్యక్తి నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజశేఖర్ తో ఉన్న లింక్స్ పై ఆరా తీస్తున్నారు. టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయిన పరీక్షలను ప్రశాంత్ రాసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే ఇదే కేసులో పలువురు అనుమానితులకు నోటీలు జారీ చేశారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. నిందితులు ప్రవీణ్ కుమార్, రేణుక డాక్యలకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై సోమవారం నాంపల్లి కోర్టు విచారించనుంది. మరోవైపు TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏ 1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్, ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్ లను ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. సిట్ కస్టడీ పిటిషన్ పై మార్చి 25వ తేదీన నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.