విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించారు. ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్, ఆలయ కార్యనిర్వహణాధికారి డీ. భ్రమరాంబ కలిసి సీజేఐకి స్వాగతం పలికారు. వాయిద్యాల మధ్య జస్టిస్ డీవై చంద్రచూడ్ అమ్మవారి ఆలయం వద్దకు సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లారు. 

అనంతరం ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించి, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సీజేఐని వేదపండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. జస్టిస్ చంద్రచూడ్ తో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణ్ రావు, ప్రోటోకాల్ రిజిస్ట్రార్ రాఘవస్వామి, ఆర్థిక శాఖ ట్రైబ్యునల్ ఛైర్మన్ కేవీఎల్ హరనాథ్ గుప్తా, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ను గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఓ హోటల్ లో కలిశారు.