సివిల్ సప్లై ఆఫీసులో రేషన్ డీలర్ల కొట్లాట

సివిల్ సప్లై ఆఫీసులో రేషన్ డీలర్ల కొట్లాట
  • అక్రమంగా కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు

హైదరాబాద్: సివిల్ సప్లై కమిషనర్ ఆఫీసులో రేషన్ డీలర్ల మధ్య గొడవ జరిగింది. కమిషనర్ ముందే రేషన్ డీలర్లు ఘర్షణ పడ్డారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజుపై రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వైకుంఠం దాడి చేశారు. రంగారెడ్డి జిల్లాలో రేషన్ డీలర్లు కమిషన్ తీసుకుంటున్నారని రాజు ఫిర్యాదు చేశారు.

కమిషనర్ కు ఎలా ఫిర్యాదు చేస్తారంటూ రాజుపై రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. కమిషనర్ ఆఫీసులో డీలర్ల ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. అక్రమంగా కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న సందర్భంగా ఘర్షణ చోటు చేసుకోవడం కలకలం రేపింది. రేషన్ డీలర్లు ప్రతి నెల అక్రమంగా 3 లక్షల కమిషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు రావటంతో సివిల్ సప్లై అధికారులు విచారణ చేస్తున్నారు.