హైదరాబాద్, వెలుగు: కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్నూతన సేవలను ప్రారంభించింది. ఇక నుంచి కస్టమర్లు.. స్పీడ్పోస్టు(డాక్యూమెంట్, పార్సిల్స్), రిజిస్టర్ లెటర్లు, పార్సిళ్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు.
దీనికోసం పోస్టల్ డిపార్ట్మెంట్‘క్లిక్ అండ్ బుక్’ పేరుతో నూతన సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సర్వీసును హైదరాబాద్ సిటీలోని 107 పిన్కోడ్లలో అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ ద్వారా స్లాట్ను బుక్ చేసుకోవడానికి https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspxలో నమోదు చేసుకోవాలి. 5 కిలోల లోపు పార్సిల్స్ పంపించేవారికి ఈ పికప్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. మొత్తం టారిఫ్ 500 కంటే తక్కువగా ఉంటే రూ.50 పికప్ చార్జీలు వసూలు చేస్తారు. 500 కంటే పైన టారిఫ్ ఉంటే పోస్టుమన్ ఫ్రీగా పార్సిల్ ను పికప్ చేసుకుంటారు. ఆదివారాలు, గెజిటెడ్ సెలవులు మినహా మిగతా అన్ని రోజుల్లో ఈ పికప్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. పార్సిల్స్ కు సంబంధించి నిషేధిత వస్తువులు ఏవో తెలుసుకోవడానికి https://www.indiapost.gov.in/MBE/Pages/Content/Prohibited-Articles.aspx వెబ్ సైట్ను సందర్శించాలని పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది.