రైతు సమస్యలపై ఉద్యమ కార్యాచరణ : భట్టి

రైతు సమస్యలపై ఉద్యమ కార్యాచరణ : భట్టి

వ్యవసాయ, భూమి, రైతు సంబంధ అంశాలపైన పెద్దఎత్తున పోరాటం చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జూమ్ ద్వారా సమావేశమైయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలు ప్రజాసమస్యలపై చర్చించారు. ఈ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతు సంబంధ అంశాలపై మాట్లాడారు. వ్యవసాయ సంబంధ సమస్యలపై సీఎస్ తో సమయం తీస్కొని టీపీసీసీ బృందం కలిసి చర్చించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

రాష్ట్రంలో రాజకీయాలు జుగుప్సాకరంగా మారిపోయాయని.. ఎన్నికలలో విశృంఖలంగా మద్యం, డబ్బు పంపిణీ జరుగుతుందన్నారు. వివాదాస్పద అంశాలను ముందు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని బీజేపీ, టీఆర్ఎస్ లు లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. పోడు భూములు, ధరణి సమస్యలు, రైతు రుణమాఫీ, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వరస పోరాటాలు చేయాలి సూచించారు. దీర్ఘకాలిక పోరాటాల కోసం ఒక ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని భట్టి తెలిపారు.