సీఎల్పీ భేటీ ...ఎప్పుడంటే...

సీఎల్పీ భేటీ ...ఎప్పుడంటే...

 

  సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం 

 హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు మాదాపూర్ లోని ఓ హోటల్ లో జరగనుంది. ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్ గా ఎమ్మెల్సీ  మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించినందుకు హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎల్పీ తీర్మానం చేయనుంది. అనంతరం పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై చర్చించే అవకాశం ఉంది. శనివారం గాంధీ భవన్ లో జరిగిన పార్టీ సమీక్షలో అధికారులు తమ మాట వినడం లేదని పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువచ్చారు.