ప్రత్యేక హోదా పై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసిన జగన్

ప్రత్యేక హోదా పై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసిన జగన్

పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలి అని సీఎం జగన్ ప్రధాని మోడీకి విశాఖ సభ వేదికలో విన్నవించారు. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి.. కేంద్ర నుంచి వచ్చే నిధుల్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నామని జగన్ అన్నారు. ఏపీలో వనరులు, బడ్జెట్‭కి అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏపీకి ఇచ్చే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే రూపాయి బాగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. 

తమ ప్రజలు ప్రేమను మాత్రం గుర్తు పెట్టుకుంటారని జగన్ అన్నారు. తమకు… రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదని స్పష్టం చేశారు. పెద్దమనస్సుతో మీరు చూపే ప్రేమను ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశామన్న సీఎం.. రాష్ట్ర విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మోడీతో కలిసి వివిధ ప్రాజెక్టుల నమూనాలు పరిశీలించారు.