పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్

పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్

​మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా  చేపట్టలేదని  ఎమ్మిగనూరు సిద్ధం సభలో సీఎం జగన్​ అన్నారు. పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా అని ప్రశ్నించారు.   వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధనికులకు అందే చదువు.. పేద విద్యార్థులు కూడా అందిస్తున్నామన్నారు.  విద్యారంగాన్ని  విస్మరించిన చంద్రబాబుకు ఓటేస్తారా అని సీఎం జగన్​ ప్రశ్నించారు.  మీ ఓటుతోనే మీ పిల్లల భవిష్యత్​ మారుతుందన్నారు.  విద్యారంగంలో వచ్చిన మార్పులకు సంతోష పడుతున్నానంటూ.. మే 13న కురుక్షేత్ర యుద్దం జరగబోతుందన్నారు.  58 నెలల్లో ఆంధ్రప్రదేశ్​ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.

మా పథకాలు చూశారు..  ప్రభుత్వాన్ని చూసి రాఖీ కట్టండని సీఎం జగన్​ అన్నారు.  ఇళ్ల పట్టాలిచ్చిన వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలన్నారు.  పేద మహిళల కష్టాల నుంచి సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మిగనూరు సభలో అన్నారు.

Also Read: బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్