మంత్రి గంగులకు పితృవియోగం..కేసీఆర్ సంతాపం

మంత్రి  గంగులకు పితృవియోగం..కేసీఆర్ సంతాపం

మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) అనారోగ్యంతో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి ఇవాళ కరీంనగర్ లో ఆయన నివాసంలో మృతి చెందారు. మల్లయ్య మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ మంత్రి గంగులకు ఫోన్ చేసి పరామర్శించి.. విచారం వ్యక్తం చేశారు.

తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న గంగులను సీఎం కేసీఆర్ ఓదార్చి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్య ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం ప్రార్థించారు.