మమ్మల్ని ఆదుకోరూ.. మోడీకి కేసీఆర్ విజ్ఞప్తి

మమ్మల్ని ఆదుకోరూ.. మోడీకి కేసీఆర్ విజ్ఞప్తి

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు సీఎం. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్… ప్రధాని నరేంద్ర మోడీతో పాటు… పలువురు కేంద్ర మంత్రులను కలిసిశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సీఎం… దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి, నిధులు, వరదసాయంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు ఆర్థిక సహకారం అందించాలని ప్రధానిని కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది. జీఎస్టీ బకాయిల అంశాలనూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.