108, అమ్మఒడి వాహనాలను ప్రారంభించిన కేసీఆర్

108,  అమ్మఒడి వాహనాలను ప్రారంభించిన కేసీఆర్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 108 అంబులెన్స్ లు, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. మొత్తం 204 అంబులెన్స్ లు, 34 పరమపద వాహనాలు, 228 అమ్మఒడి వాహనాలకు జెండా ఊపి స్టార్ట్ చేశారు. కార్యక్రమంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ , ఇతర నేతలు పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు రాష్ట్రంలో108 వాహనాలు 321 వాహనాలుంటే ఇపుడు రూ., 455 కు పెంచామన్నారు మంత్రి హరీశ్ రావు.  వైద్య రంగంలో దేశానికే  తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా ఎన్నో కార్యక్రమాను  ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 

తెలంగాణలో లక్ష జనాభాకు ఒక 108 వాహనం ఉంటే ఇపుడు ప్రతి 75 వేల మందికి ఒక 108 వాహనం ఉందన్నారు హరీశ్ రావు. పాత వాహనాల స్థానంలోనే అమ్మఒడి వాహనాలను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ వైద్యం పట్ట ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాలు పెంచుతామన్నారు